News in pics: చిత్రం చెప్పే విశేషాలు (30-06-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 30 Jun 2024 14:56 IST
1/14
కరీంనగర్‌లోని బస్టాండ్‌ ఏరియాలో  రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు చిత్రపటానికి న్యూస్‌ పేపర్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నివాళులర్పించారు.
కరీంనగర్‌లోని బస్టాండ్‌ ఏరియాలో  రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు చిత్రపటానికి న్యూస్‌ పేపర్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నివాళులర్పించారు.
2/14
కరీంనగర్‌లో న్యూస్‌ పేపర్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు..
కరీంనగర్‌లో న్యూస్‌ పేపర్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు..
3/14
విశాఖ జిల్లా చింతపల్లి మండలం బైలుకించంగిలో బ్రహ్మకమలాలు విరబూశాయి. హిందీ ఉపాధ్యాయుడు గసాడ పద్మనాభం ఇంటి పెరట్లో రాత్రివేళల్లో ఇవి వికసించి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కేవలం రాత్రివేళల్లో మాత్రమే వికసించడం వీటి ప్రత్యేకత. 
విశాఖ జిల్లా చింతపల్లి మండలం బైలుకించంగిలో బ్రహ్మకమలాలు విరబూశాయి. హిందీ ఉపాధ్యాయుడు గసాడ పద్మనాభం ఇంటి పెరట్లో రాత్రివేళల్లో ఇవి వికసించి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కేవలం రాత్రివేళల్లో మాత్రమే వికసించడం వీటి ప్రత్యేకత. 
4/14
ఇదేం చెరువు కాదు..  కరీంనగర్‌  ఒకటో డివిజన్‌ పరిధిలోని రైల్వేస్టేషన్‌ గేట్‌ సమీపంలో ఉన్న చంద్రపురి కాలనీ ఖాళీ స్థలంలో నిలిచిన వర్షం నీరు ఇది. ఓ వీధిలోకి రాకపోకలు సాగించాలంటే ఇందుల్లోంచే వెళ్లాల్సి రావడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇదేం చెరువు కాదు..  కరీంనగర్‌  ఒకటో డివిజన్‌ పరిధిలోని రైల్వేస్టేషన్‌ గేట్‌ సమీపంలో ఉన్న చంద్రపురి కాలనీ ఖాళీ స్థలంలో నిలిచిన వర్షం నీరు ఇది. ఓ వీధిలోకి రాకపోకలు సాగించాలంటే ఇందుల్లోంచే వెళ్లాల్సి రావడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
5/14
తొలకరి వర్షాలకు జగిత్యాల జిల్లాలోని అటవీ తీర ప్రాంతాలు ప్రకృతి సోయగంతో పచ్చని తోరణంలా మారాయి. రాయికల్‌ మండలంలోని కట్కాపూర్‌ గ్రామంలోని వెన్నెముద్దల గండి నీటి ప్రవాహంతో కళకళలాడుతోంది. రహదారి పొడవునా పచ్చని చెట్లతో సందర్శకులను ఆకట్టుకుంటోంది. 
తొలకరి వర్షాలకు జగిత్యాల జిల్లాలోని అటవీ తీర ప్రాంతాలు ప్రకృతి సోయగంతో పచ్చని తోరణంలా మారాయి. రాయికల్‌ మండలంలోని కట్కాపూర్‌ గ్రామంలోని వెన్నెముద్దల గండి నీటి ప్రవాహంతో కళకళలాడుతోంది. రహదారి పొడవునా పచ్చని చెట్లతో సందర్శకులను ఆకట్టుకుంటోంది. 
6/14
పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలంలోని దశుమంతపురం గ్రామానికి చెందిన ఎ.వైకుంఠరావు పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడి చిత్రాలను రావి ఆకులపై రూపొందించారు.
పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలంలోని దశుమంతపురం గ్రామానికి చెందిన ఎ.వైకుంఠరావు పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడి చిత్రాలను రావి ఆకులపై రూపొందించారు.
7/14
హైదరాబాద్‌: ఆరు బంతులు.. కోట్ల కళ్లు.. చివరి బంతి పడిందో లేదో.. ఒక్కసారిగా నగరమంతా వేడుకల్లో మునిగిపోయింది. శనివారం రాత్రి టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ విజయం సాధించడంతో భాగ్యనగరమంతటా సంబరాలు అంబరాన్నంటాయి.
హైదరాబాద్‌: ఆరు బంతులు.. కోట్ల కళ్లు.. చివరి బంతి పడిందో లేదో.. ఒక్కసారిగా నగరమంతా వేడుకల్లో మునిగిపోయింది. శనివారం రాత్రి టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ విజయం సాధించడంతో భాగ్యనగరమంతటా సంబరాలు అంబరాన్నంటాయి.
8/14
హైదరాబాద్‌: హుస్సేన్‌ సాగర్‌లో రేగట్టా క్రీడాకారులు సాధన చేస్తూ కనిపించారు. ఒకే వరుసలో తెల్లని తెరచాపలతో జాతీయ జెండా నీడలో ఇలా నగరవాసులకు కనువిందు కలిగించారు.
హైదరాబాద్‌: హుస్సేన్‌ సాగర్‌లో రేగట్టా క్రీడాకారులు సాధన చేస్తూ కనిపించారు. ఒకే వరుసలో తెల్లని తెరచాపలతో జాతీయ జెండా నీడలో ఇలా నగరవాసులకు కనువిందు కలిగించారు.
9/14
కరీంనగర్‌: తొలకరి వర్షాలకు రాయికల్‌ మండలంలోని అటవీ తీర ప్రాంతాలు ప్రకృతి సోయగంతో పచ్చని తోరణంలా మారాయి. గ్రామంలోని వెన్నెముద్దల గండి నీటి ప్రవాహంతో కళకళలాడుతోంది. రహదారి పొడవునా పచ్చని చెట్లతో సందర్శకులను ఆకట్టుకుంటోంది.
కరీంనగర్‌: తొలకరి వర్షాలకు రాయికల్‌ మండలంలోని అటవీ తీర ప్రాంతాలు ప్రకృతి సోయగంతో పచ్చని తోరణంలా మారాయి. గ్రామంలోని వెన్నెముద్దల గండి నీటి ప్రవాహంతో కళకళలాడుతోంది. రహదారి పొడవునా పచ్చని చెట్లతో సందర్శకులను ఆకట్టుకుంటోంది.
10/14
ఆదిలాబాద్‌: జిల్లా కేంద్రంలో జేసీ అకాడమీ నిర్వాహకులు బార్బడోస్‌లో జరుగుతున్న ప్రపంచ కప్‌ టీ20 క్రికెట్‌ ఫైనల్‌ పోటీని టీవీలో ప్రత్యక్షంగా వీక్షించారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత జట్టు బ్యాట్స్‌మెన్లు ఫోర్లు, సిక్స్‌లు కొట్టినప్పుడల్లా క్రీడాకారులు కేరింతలతో హోరెత్తించారు. సందడి చేశారు.
ఆదిలాబాద్‌: జిల్లా కేంద్రంలో జేసీ అకాడమీ నిర్వాహకులు బార్బడోస్‌లో జరుగుతున్న ప్రపంచ కప్‌ టీ20 క్రికెట్‌ ఫైనల్‌ పోటీని టీవీలో ప్రత్యక్షంగా వీక్షించారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత జట్టు బ్యాట్స్‌మెన్లు ఫోర్లు, సిక్స్‌లు కొట్టినప్పుడల్లా క్రీడాకారులు కేరింతలతో హోరెత్తించారు. సందడి చేశారు.
11/14
అనంతపురం: శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం పేరూరు జలాశయం వద్ద రెండు చిలుకలు గూటి కోసం కొట్లాడుకున్నాయి. తన గూటి వద్ద వాలిందని ఒక రామచిలుకపై మరొక చిలుక పోరుకు దిగింది. కొన్ని నిమిషాలపాటు ఆ రెండు గాలిలో చిన్నపాటి యుద్ధం చేసుకున్న దృశ్యాలు కెమరాకు చిక్కాయి.
అనంతపురం: శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం పేరూరు జలాశయం వద్ద రెండు చిలుకలు గూటి కోసం కొట్లాడుకున్నాయి. తన గూటి వద్ద వాలిందని ఒక రామచిలుకపై మరొక చిలుక పోరుకు దిగింది. కొన్ని నిమిషాలపాటు ఆ రెండు గాలిలో చిన్నపాటి యుద్ధం చేసుకున్న దృశ్యాలు కెమరాకు చిక్కాయి.
12/14
వరంగల్‌: మహబూబాబాద్‌ జిల్లా పాలనాధికారి కార్యాలయ ప్రాంగణం పచ్చదనంతో కనువిందు చేస్తోంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షపు చినుకులతో తడిసి ముద్దయిన నేలపై పచ్చదనం పరుచుకొని సందర్శకులను ఆకర్షిస్తోంది.
వరంగల్‌: మహబూబాబాద్‌ జిల్లా పాలనాధికారి కార్యాలయ ప్రాంగణం పచ్చదనంతో కనువిందు చేస్తోంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షపు చినుకులతో తడిసి ముద్దయిన నేలపై పచ్చదనం పరుచుకొని సందర్శకులను ఆకర్షిస్తోంది.
13/14
హైదరాబాద్‌: వర్షాధార పంటల్లో పత్తి ఒకటి. మొదటి వర్షానికి విత్తనాలు వేస్తే.. ఆ తర్వాత వర్షాలు మొహం చాటేశాయి.. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం ఆసిరెడ్డిపల్లికి చెందిన యువ రైతు నాగేశ్‌ తుంపర పద్ధతిలో పత్తి పంటకు నీటిని అందిస్తున్నాడు.
హైదరాబాద్‌: వర్షాధార పంటల్లో పత్తి ఒకటి. మొదటి వర్షానికి విత్తనాలు వేస్తే.. ఆ తర్వాత వర్షాలు మొహం చాటేశాయి.. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం ఆసిరెడ్డిపల్లికి చెందిన యువ రైతు నాగేశ్‌ తుంపర పద్ధతిలో పత్తి పంటకు నీటిని అందిస్తున్నాడు.
14/14
చిత్తూరు: కోటలోని కోటమ్మ ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.సముద్రస్నానానికి వెళ్లి వందలాది మంది భక్తులు పూలబుట్టలతో ఆలయ ధర్మకర్త ఇంటి నుంచి ఆలయం వరకు ఊరేగింపుగా వచ్చారు.
చిత్తూరు: కోటలోని కోటమ్మ ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.సముద్రస్నానానికి వెళ్లి వందలాది మంది భక్తులు పూలబుట్టలతో ఆలయ ధర్మకర్త ఇంటి నుంచి ఆలయం వరకు ఊరేగింపుగా వచ్చారు.
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు