బ్రేకింగ్

breaking
03 Jul 2024 | 14:57 IST

జగన్‌ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్‌పై ఉన్న కేసుల గురించి దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్‌ కేసులను రోజువారీగా విచారించాలని హైకోర్టు ఆదేశించింది. జగన్‌ కేసులపై గతంలో హరిరామజోగయ్య హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది కోర్టులో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది. 

మరిన్ని

తాజా వార్తలు