బ్రేకింగ్

breaking
03 Jul 2024 | 12:32 IST

వాళ్లది రిమోట్‌ కంట్రోల్‌ ప్రభుత్వం: ప్రధాని మోదీ

దిల్లీ: పరాజయానికి సంబంధించి కాంగ్రెస్‌ నేతలు అన్య మనస్కంగా ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశ ప్రజల నిర్ణయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘గతంలో ప్రతిపక్షం హయాంలో రిమోట్‌ కంట్రోల్‌ ప్రభుత్వాన్ని నడిపింది. పదేళ్లుగా అఖండ సేవాభావంతో ఎన్డీయే ముందుకెళ్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుస్తాం. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్త ఉత్సవాలు నిర్వహించాలి’’ అని మోదీ తెలిపారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని