బ్రేకింగ్

breaking
01 Jul 2024 | 17:48 IST

కవిత బెయిల్‌ పిటిషన్లు తిరస్కరణ

దిల్లీ: భారాస ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ కోసం దాఖలు చేసిన రెండు పిటిషన్లను దిల్లీ హైకోర్టు సోమవారం తిరస్కరించింది. సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్‌ కోరుతూ కవిత పిటిషన్లు దాఖలు చేశారు. ఈడీ, సీబీఐ తరఫున వాదనలు వినిపిస్తూ.. దిల్లీ మద్యం కేసు కీలక దశలో కొనసాగుతున్న తరుణంలో ఆమెకు బెయిల్‌ మంజూరు చేస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని వాదించారు. అందువల్ల ఎట్టిపరిస్థితుల్లో ఆమెకు బెయిల్‌ మంజూరు చేయొద్దని కోరారు.

మరిన్ని

తాజా వార్తలు