బ్రేకింగ్

breaking
01 Jul 2024 | 15:55 IST

TG: నూతన చట్టాల కింద తొలి కేసు నమోదు

హైదరాబాద్‌: నేటి నుంచి అమల్లోకి వచ్చిన నూతన చట్టాల కింద తెలంగాణలో తొలి కేసు నమోదైంది. నెంబర్‌ ప్లేట్‌ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారుడిపై చార్మినార్ పీఎస్‌లో ఈ కేసు నమోదు చేశారు. కొత్త చట్టాల ప్రకారం సెక్షన్‌ 281 బీఎన్‌ఎస్‌, ఎంవీ యాక్ట్‌ కింద ఎఫ్‌ఐఆర్‌ను డిజిటల్‌గా నమోదు చేశారు.

మరిన్ని

తాజా వార్తలు