బ్రేకింగ్

breaking
01 Jul 2024 | 15:52 IST

INDwXSAw: మన అమ్మాయిలూ గెలిచేశారు!

చెన్నై: దక్షిణాఫ్రికాపై భారత్‌ మహిళలు ఘనవిజయం సాధించారు. చెన్నైలో జరిగిన ఏకైక టెస్టులో 10 వికెట్ల తేడాతో టీమ్‌ ఇండియా అమ్మాయిలు గెలుపొందారు. 37 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమ్మాయిలు 10 ఓవర్లు పూర్తి కాకుండానే సాధించేశారు. శుభ (13*), షెఫాలీ (24*) ఇబ్బంది పడకుండా గెలిపించేశారు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 603/6 చేసింది. సఫారీలు తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులు చేసి.. ఫాలో ఆన్‌కి దిగి రెండో ఇన్నింగ్స్‌లో 373 పరుగులు చేశారు. 

మరిన్ని

తాజా వార్తలు