బ్రేకింగ్

breaking
01 Jul 2024 | 12:17 IST

వెస్టిండీస్‌లో తుపాను.. బార్బడోస్‌లోనే టీమ్‌ఇండియా

వెస్టిండీస్‌: తుపాను వల్ల బార్బడోస్‌లో టీమ్‌ఇండియా చిక్కుకుంది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో తుపాను హెచ్చరికలు జారీ చేశారు. ఈక్రమంలో ముందు జాగ్రత్తతో అక్కడి అధికార యంత్రాంగం బార్బడోస్‌ విమానాశ్రయాన్ని మూసివేసింది. ప్రతికూల వాతావరణంతో భారత క్రికెట్‌ జట్టు బార్బడోస్‌లోనే ఉండిపోయింది. బార్బడోస్‌లో కర్ఫ్యూ దృష్ట్యా టీమ్‌ఇండియా రాక ఆలస్యమయ్యే అవకాశం ఉంది. పరిస్థితులు మెరుగుపడే వరకు ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

మరిన్ని

తాజా వార్తలు