బ్రేకింగ్

breaking
01 Jul 2024 | 11:48 IST

పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటా: పవన్‌

కాకినాడ: భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటానని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులు ఎటు వెళ్లాయో తెలియట్లేదు. రూ.600 కోట్లతో రుషికొండలో ప్యాలెస్‌ కట్టుకున్నారు. అవే నిధులు ఇక్కడ ఉపయోగిస్తే జిల్లా అభివృద్ధి అయ్యేది. నా వైపు నుంచి ఎలాంటి అవినీతి ఉండదు. పర్యావరణ శాఖను బలోపేతం చేస్తాం. గోదావరి పారుతున్నా తాగునీటికి ఇబ్బందులున్నాయి’’ అని పవన్‌ తెలిపారు.

మరిన్ని

తాజా వార్తలు