బ్రేకింగ్

breaking
01 Jul 2024 | 10:54 IST

కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు

హైదరాబాద్‌: భారాస అధినేత కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. విద్యుత్‌ కమిషన్‌ను రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం కొట్టేసింది. విద్యుత్‌ కమిషన్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈక్రమంలో ఆయన తరఫు న్యాయవాదుల వాదనతో హైకోర్టు విభేదించింది. అడ్వొకేట్‌ జనరల్‌ వాదనలను సమర్థించింది. విద్యుత్‌ కమిషన్‌ విచారణను కొనసాగించొచ్చంటూ ధర్మాసనం స్పష్టం చేసింది.

మరిన్ని

తాజా వార్తలు