బ్రేకింగ్

breaking
01 Jul 2024 | 10:01 IST

సవరించిన ర్యాంకులతో నీట్‌ యూజీ ఫలితాలు

దిల్లీ: నీట్ యూజీ 2024 అభ్యర్థుల ర్యాంకులను ఎన్‌టీఏ సవరించింది. 1563 మంది అభ్యర్థుల ర్యాంకులను సవరించి నీట్‌ ఫలితాలు ప్రకటించింది. ఈమేరకు నీట్‌ యూజీ 2024 అభ్యర్థులందరి ర్యాంకులు సవరించినట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. గత నెల 23న 1563 మందికి మరోసారి పరీక్ష నిర్వహించగా... 813 మంది హాజరైనట్లు పేర్కొంది. అన్ని ప్రశ్నలకు సమాధానాలతో ఫైనల్‌ కీని వెబ్‌సైట్‌లో ఉంచినట్లు వెల్లడించింది. ఫైనల్‌ స్కోర్ కార్డ్‌లు exams.nta.ac.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. 

మరిన్ని

తాజా వార్తలు