బ్రేకింగ్

breaking
01 Jul 2024 | 07:14 IST

లోకేశ్‌ మీ అందరి అభిమానం చూరగొన్నారు: చంద్రబాబు

అమరావతి: కొత్త ప్రభుత్వంలో మొదటగా పింఛన్ల పంపిణీ చేపట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో పింఛన్ల పంపిణీ అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘మీ అందరి ఆశీస్సులతో నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేశా. మీ అందరి అభిమానం చూరగొని లోకేశ్‌ ఇక్కడి నుంచి పోటీ చేశారు. మంగళగిరిలో 90 వేలకు పైగా మెజారిటీతో ఆయన్ను గెలిపించారు. వైకాపా నేతలు ఐదేళ్ల పాటు ప్రజలను అణగదొక్కారు. పెట్టుబడులు పెట్టేందుకు భయపడే పరిస్థితి కల్పించారు’’ అని చంద్రబాబు తెలిపారు.  

మరిన్ని

తాజా వార్తలు