బ్రేకింగ్

breaking
01 Jul 2024 | 06:33 IST

పింఛన్ల పంపిణీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు.. ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీని ప్రారంభించారు. మంత్రి లోకేశ్‌తో కలిసి ఆయన మంగళగిరి నియోజకవర్గం పెనుమాక చేరుకున్నారు. ఆయనకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. అనంతరం లబ్ధిదారు ఇంటికి వెళ్లి సీఎం చంద్రబాబు స్వయంగా పింఛను పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 65.18 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేయనున్నారు.

మరిన్ని

తాజా వార్తలు