బ్రేకింగ్

breaking
20 Dec 2023 | 17:24 IST

తెలుగు రచయితకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

దిల్లీ: ప్రముఖ తెలుగు కథా, నవలా రచయిత తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రచించిన ‘రామేశ్వరం కాకులు.. మరికొన్ని కథలు’ అనే లఘు కథల పుస్తకానికి ఈ పురస్కారం దక్కింది. దేశవ్యాప్తంగా 24 భాషల్లో రాసిన కథలను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలకు ఎంపిక చేసింది. తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి 1945లో పిఠాపురంలో జన్మించారు. రామేశ్వరం కాకులు నుంచి రోహిణి కథ వరకూ పలు కథలను ‘రామేశ్వరం కాకులు.. మరికొన్ని కథలు’ పేరిట పుస్తకంగా ముద్రించారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని