Rohit - Virat : విరాట్ కోహ్లీని అధిగమించిన రోహిత్ శర్మ.. అయితే ధోనీనే టాప్!
గత సంవత్సరం విరాట్ కోహ్లీ నుంచి రోహిత్ శర్మ టీమ్ఇండియా సారథ్య బాధ్యతలను అందుకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఓ విషయంలో విరాట్ కోహ్లీని...
ఇంటర్నెట్ డెస్క్: గత సంవత్సరం విరాట్ కోహ్లీ నుంచి రోహిత్ శర్మ టీమ్ఇండియా సారథ్య బాధ్యతలను అందుకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఓ విషయంలో విరాట్ కోహ్లీని రోహిత్ అధిగమించాడు. ఆసియా కప్లో హాంకాంగ్పై భారత్ విజయం సాధించింది. దీంతో రోహిత్ శర్మ కెప్టెన్గా 31 టీ20ల్లో భారత్ జట్టును గెలిపించినట్లైంది. ఇది రోహిత్కు 37వ మ్యాచ్ మాత్రమే కావడం విశేషం. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ సారథిగా 30 విజయాల (50 మ్యాచ్ల్లో) రికార్డును రోహిత్ తుడిచిపెట్టాడు. ఇక టీమ్ఇండియా తరఫున అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్గా మాజీ సారథి ఎంఎస్ ధోనీ కొనసాగుతున్నాడు. ధోనీ నాయకత్వంలో 72 మ్యాచ్లకుగాను భారత్ 41 విజయాలను నమోదు చేసింది.
3500 మార్క్ను దాటిన రోహిత్
టీ20ల్లో అత్యధిక పరుగుల వీరుడిగా రోహిత్ శర్మ (134 మ్యాచుల్లో 3,520 పరుగులు) కొనసాగుతున్నాడు. పాక్పై 12 పరుగులు సాధించిన రోహిత్ అప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న మార్టిన్ గప్తిల్ (121 మ్యాచుల్లో 3,497)ను అధిగమించిన విషయం తెలిసిందే. తాజాగా హాంకాంగ్పై 21 పరుగులు చేసిన రోహిత్ శర్మ టీ20ల్లో 3,500 పరుగుల మార్క్ను దాటిన తొలి బ్యాటర్గా అవతరించాడు. మరోవైపు హాంకాంగ్పై అదరగొట్టిన విరాట్ కోహ్లీ కూడా ఓ ఘనతను తన ఖాతాలో వేసుకొన్నాడు. 101 టీ20ల్లోనే 50.78 సగటుతో 3,402 పరుగులు సాధించిన కోహ్లీ అత్యధిక రన్స్ చేసిన వారి జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.
ఆరేళ్ల తర్వాత కోహ్లీ బౌలింగ్
విరాట్ కోహ్లీ రెగ్యులర్ బౌలింగ్ వేయడు. అయితే హాంకాంగ్తో జరిగిన మ్యాచ్లో ఒక ఓవర్ వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అదీనూ హాంకాంగ్ ఇన్నింగ్స్లోని 17వ ఓవర్ కావడం విశేషం. ఈ ఓవర్లో కేవలం ఆరు పరుగులను మాత్రమే ఇచ్చాడు. దాదాపు ఆరేళ్ల తర్వాత బంతిని సంధించిన విరాట్ కోహ్లీ ఎంతో కంట్రోలింగ్గా బౌలింగ్ వేశాడు. దీంతో నెట్టింట్లో వైరల్గా మారిపోయాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
-
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
-
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,268
-
స్పీకర్ తమ్మినేని కోటకు బీటలు!
-
నా భార్యకు ఏమైనా అయితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్