Andhra News: నెల్లూరు జంట హత్యల కేసు.. హోటల్ సప్లయరే హంతకుడు: ఎస్పీ విజయరావు
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కృష్ణారావు, సునీత దంపతులను అతి కిరాతకంగా హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. కృష్ణారావు క్యాంటీన్లో
నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కృష్ణారావు, సునీత దంపతులను అతి కిరాతకంగా హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. కృష్ణారావు క్యాంటీన్లో పనిచేసే సప్లయర్ శివ.. మృతుడి బంధువు రామకృష్ణ కలిసి ఈ హత్యలు చేసినట్లు జిల్లా ఎస్పీ విజయరావు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ మీడియాకు వివరించారు.
‘‘హోటల్లో అనేక సార్లు తిట్టారని కృష్ణారావుపై శివ కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో కోపం, డబ్బు కోసం పథకం ప్రకారమే వారిద్దరినీ హత్య చేశారు. ముందు కృష్ణారావు గొంతు కోసి.. ఆ తర్వాత నిద్రిస్తున్న సునీత తలపై బలంగా కొట్టి చంపేశారు. ఇంట్లోని రూ.1.60 లక్షలు తీసుకెళ్లారు. డబ్బుపై ఆశతో శివకు రామకృష్ణ సాయం చేశాడు. హత్య చేసినట్లు ఎవరికీ అనుమానం రాకుండా కృష్ణారావు, సునీత దంపతుల అంత్యక్రియల్లోనూ వారు పాల్గొన్నారు. సీసీ కెమెరాల ద్వారా మరిన్ని వివరాలు సేకరించాం. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన దర్యాప్తునకు అనుగుణంగా 15 రోజుల్లోనే ఛార్జ్షీట్ దాఖలు చేసి నిందితులను న్యాయస్థానంలో హాజరుపరుస్తాం’’ అని ఎస్పీ తెలిపారు.
అసలేం జరిగింది..
నగరంలోని పడారుపల్లి అశోక్నగర్లో వాసిరెడ్డి కృష్ణారావు (54), సునీత (50) దంపతులు నివాసం ఉంటున్నారు. నెల్లూరులోని కరెంటు ఆఫీసు సెంటర్లో కృష్ణారావు హోటల్ నిర్వహించేవారు. రోజూ రాత్రి హోటల్ మూసేసిన తర్వాత.. ఆలస్యంగా ఇంటికి చేరుకునేవారు. ఈ నెల 27న రాత్రి 11 నుంచి 12 గంటల ప్రాంతంలో దంపతులను హత్య చేశారు. ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో పాలు పోసేందుకు వచ్చిన రమణమ్మ.. కృష్ణారావు మృతదేహాన్ని చూసి భయంతో కేకలు వేసింది. స్థానికుల సాయంతో పోలీసులు, మృతుల కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఘటన జరిగిన ఇల్లు ప్రధాన రహదారికి కాస్త దూరంగా ఉండటం, అర్ధరాత్రి కావడంతో చుట్టుపక్కల వారికి తెలియలేదు. వీరికి ఇద్దరు కుమారులు సాయిచంద్, గోపీచంద్లు ఉన్నారు. వివాహాలు అయ్యాక వాళ్లు వేరుగా ఉంటున్నారు. పెద్ద కుమారుడు విశాఖపట్నంలోని పోస్టల్ శాఖలో ఉద్యోగి కాగా, చిన్న కుమారుడు నగరంలోని పొగతోట ప్రాంతంలో హోటల్ నిర్వహిస్తున్నారు. కృష్ణారావు కుటుంబం 15ఏళ్ల కిందట ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం ఇందుగపల్లి నుంచి వచ్చి నెల్లూరులో స్థిరపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.