Crime News: తిరుపతి జిల్లాలో దారుణం.. బాలికపై సామూహిక అత్యాచారం

తిరుపతి జిల్లాలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని కేవీబీ పురం మండలంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

Updated : 12 Oct 2022 10:57 IST

సత్యవేడు: తిరుపతి జిల్లాలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని కేవీబీ పురం మండలంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలికకు ముగ్గురు యువకులు మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి ఎత్తుకెళ్లినట్లు బాలిక తల్లి, అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గ్రామానికి వెళ్లి విచారించగా.. ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడినట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. అయితే, నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. బాలిక ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని.. స్వల్ప గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు